పాడితో అదనపు ఆదాయం
ABN, First Publish Date - 2020-12-03T05:20:19+05:30
పాడి రైతుకు అధిక ధర లభించేలా చూడటమే లక్ష్యంగా అమూల్తో కలిసి ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. పాలవెల్లువ ప్రాజెక్టును బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమూల్ సంస్థతో ఒప్పందం వల్ల రాష్ట్రంలోని పాడి రైతుకు లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకూ అదనంగా ధర వస్తుందన్నారు.
పాలవెల్లువ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్
కలెక్టరేట్, డిసెంబరు 2 : పాడి రైతుకు అధిక ధర లభించేలా చూడటమే లక్ష్యంగా అమూల్తో కలిసి ప్రాజెక్టును చేపడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. పాలవెల్లువ ప్రాజెక్టును బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమూల్ సంస్థతో ఒప్పందం వల్ల రాష్ట్రంలోని పాడి రైతుకు లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకూ అదనంగా ధర వస్తుందన్నారు. పాల విక్రయం ద్వారా వచ్చే లాభాల్లో పాడి రైతులకు వాటా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కేంద్రం నుంచి కలెక్టర్ హరి జవహర్లాల్, జేసీలు కిషోర్కుమార్, మహేష్కుమార్, పశుసంవర్థక శాఖ జేడీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-03T05:20:19+05:30 IST