యాజమాన్య పద్ధతులపై అవగాహన
ABN, First Publish Date - 2020-08-07T10:37:20+05:30
నారుమడిలో యాజమాన్య పద్ధతులు, దమ్ములో ఎరువులు యాజమాన్యం, కలుపు నివారణ చర్యలపై రిలయన్స్ ఫౌండేషన్, కృషీ ..
కురుపాం రూరల్, ఆగస్టు 6 : నారుమడిలో యాజమాన్య పద్ధతులు, దమ్ములో ఎరువులు యాజమాన్యం, కలుపు నివారణ చర్యలపై రిలయన్స్ ఫౌండేషన్, కృషీ విజ్ఞాన కేంద్రం రస్తాకుంటుబాయి, ఏరువాక కేంద్రం జియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఎద పద్ధతిలో విత్తుకోవలసిన రైతులు ఎరువు, విత్తనం ఒకేసారి వేసే సీడ్ డ్రిల్ను వాడాలని అన్నారు. కార్యక్రమంలో కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు, ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రాజ్, శాస్త్రవేత్త స్వాతి, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జి.తిరుమలరావు, ఎంసంతోష్తో పాటు రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-07T10:37:20+05:30 IST