నాగవంశ కార్పొరేషన్ చైర్పర్సన్ను కలిసిన డైరెక్టర్
ABN, First Publish Date - 2020-10-25T10:41:18+05:30
రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పలసూరమ్మను ఆ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జరజాపుపేటకు చెందిన మద్దిల వాసు శనివారం విశాఖపట్నం లో ..
నెల్లిమర్ల: రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పలసూరమ్మను ఆ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జరజాపుపేటకు చెందిన మద్దిల వాసు శనివారం విశాఖపట్నం లో కలిశారు. ఈసందర్భంగా చైర్పర్సన్ను సత్కరించగా, డైరెక్టర్ వాసును ఆమె అభినందించారు. నాగవంశకులస్థుల పరిస్థితి, ఆర్థిక అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై ఆమెకు వివరించారు. ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన వెంటనే తొలిసారిగా తమ జరజాపుపేట గ్రామానికి రావాల్సిందిగా ఆహ్వానించగా ఆమె అందుకు అంగీకరించినట్లు ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ భర్త అప్పలనాయుడు, జరజాపుపేట ప్రతినిధులు సముద్రపు రామారావు, తుమ్ము వెంకటరమణ, నల్లి శేఖర్, నల్లి శ్రీను, మన్యపురి మోహనరావు, రాజారావు, నారాయణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - 2020-10-25T10:41:18+05:30 IST