ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు

ABN, First Publish Date - 2020-04-10T11:50:17+05:30

బొబ్బిలి పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనాలపై సంచరిస్తున్న సుమారు వందమంది యువకులను స్థానిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

50మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు  


బొబ్బిలి, ఏప్రిల్‌ 9: బొబ్బిలి పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ  ద్విచక్ర వాహనాలపై సంచరిస్తున్న సుమారు వందమంది యువకులను స్థానిక సీఐ ఇ.కేశవ రావు పట్టుకున్నారు. వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌లో చేర్పించా రు. దీంతో ఆ వాహనాల యజమానులు వందలాదిగా పోలీసు స్టేషన్‌కు చేరుకుని రాత్రి పది గంటల వరకు తమ బైకుల కోసం పడిగాపులు కాశారు.


వారంతా పోలీసులను, సీఐని  ప్రాధేయపడినా విడిచిపెట్టలేదు. బలమైన కారణాలు చూపించిన వారిని మాత్రమే వదిలివేసి, సుమారు 50 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. బైకులను సీజ్‌ చేశారు. ఈసందర్భంగా సీఐ కేశవరావు మాట్లాడుతూ గత 18 రోజులుగా పట్టణంలోని అన్ని కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వాహనా లపై చలానాలు రాసినా, షరా మామూలుగానే నిబంధనలను ఉల్లంఘిస్తు న్నారన్నారు. అందుకే మరింత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - 2020-04-10T11:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising