ముమ్మరంగా ఇంటింటి సర్వే
ABN, First Publish Date - 2020-03-27T11:32:40+05:30
మండలంలోని పలు పంచాయతీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. గురువారం చినగుడబ, గరుగుబిల్లి, పెద్దూరు, గొట్టివలస, దళాయివలస, ఉల్లిభద్ర, దత్తివలస గ్రామాల్లో
గరుగుబిల్లి, మార్చి 26 : మండలంలోని పలు పంచాయతీల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. గురువారం చినగుడబ, గరుగుబిల్లి, పెద్దూరు, గొట్టివలస, దళాయివలస, ఉల్లిభద్ర, దత్తివలస గ్రామాల్లో ప్రజలకు వారు అవగాహన కల్పించారు. ఇళ్లు విడిచి బయటకు రావొద్దని సూచించారు. ప్రతిఒక్కరూ లాక్డౌన్ పాటించాలన్నారు. ఎంఎల్హెచ్పీ రాజేశ్వరి, ఎంపీడీవో జి.గిరిబాల, పంచాయతీ విస్తరణాధికారి ఎంవీ గోపాలకృష్ణలు సిబ్బందికి ఆదే శాల మేరకు ముమ్మరంగా బ్లీచింగ్ చల్లారు.
Updated Date - 2020-03-27T11:32:40+05:30 IST