హాకథాన్లో వీఐటీ-ఏపీ విద్యార్థుల ప్రతిభ
ABN, First Publish Date - 2020-06-07T09:30:50+05:30
‘‘కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలు’’ అనే అంశంపై నాస్కామ్కు చెందిన ఫ్యూచర్ సిల్క్స్, ఐబీఎమ్ సంస్థ సంయుక్తంగా ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ స్థాయి హాకథాన్లో వీఐటీ-ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.
హైదరాబాద్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ‘‘కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలు’’ అనే అంశంపై నాస్కామ్కు చెందిన ఫ్యూచర్ సిల్క్స్, ఐబీఎమ్ సంస్థ సంయుక్తంగా ఆన్లైన్లో నిర్వహించిన జాతీయ స్థాయి హాకథాన్లో వీఐటీ-ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. గత ఏప్రిల్ 25న ప్రారంభమైన హాకథాన్లో 26 రాష్ట్రాలకు చెందిన 500 విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో 16 జట్లు అత్యుత్తమంగా నిలిచాయి. వీటిలో 5 జట్లు వీఐటీ విద్యార్థులవే కావడం గమనార్హం. అయితే, వీఐటీ-ఏపీకి చెందిన నలుగురు విద్యార్థులతో కూడిన జట్టు ఫైనల్లో పాల్గొనడానికి అర్హత సాధించింది.
Updated Date - 2020-06-07T09:30:50+05:30 IST