హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్న జగన్: విష్ణువర్థన్రెడ్డి
ABN, First Publish Date - 2020-11-26T23:14:48+05:30
జగన్ హిందూ దేవుళ్లకు సంబంధించిన ఆలయ భూములను అమ్ముతూ హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్థన్రెడ్డి అన్నారు.
కడప: సీఎం జగన్ హిందూ దేవుళ్లకు సంబంధించిన ఆలయ భూములను అమ్ముతూ హిందూవుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్థన్రెడ్డి అన్నారు. దేశంలో పవిత్రమైన రాఘవేంద్రస్వామి మఠానికి సంబంధించిన 208 ఎకరాలు అమ్మకానికి జగన్ ప్రభుత్వం వేలం ప్రకటన ఇవ్వడం అన్యాయమని వైసీపీ ప్రభుత్వ తీరును ట్విట్టర్లో ప్రశ్నించారు. హిందూధర్మం కోసం ఇచ్చే భూములను అమ్మే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని జగన్ తీరుపై మండిపడ్డారు.
Updated Date - 2020-11-26T23:14:48+05:30 IST