తప్పుడు ప్రచారాలతో ఉద్యమకారులను అవమానించొద్దు: విష్ణువర్ధన్రెడ్డి
ABN, First Publish Date - 2020-10-23T14:42:15+05:30
అమరావతి: తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యమకారులను అవమానించొద్దని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అమరావతి: తప్పుడు ప్రచారాలు చేసి ఉద్యమకారులను అవమానించొద్దని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రైతుల ఉద్యమంలో స్వయంగా పాల్గొని మద్దతిచ్చానని ఆయన వెల్లడించారు. అమరావతి రైతులపై సామాజిక మాద్యమాల్లో తన ఫోటో పెట్టి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొందరు మిత్రుల ద్వారా తెలిసిందని విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు చర్యలు, ప్రచారాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ఉద్యమకారులను విమర్శించే హక్కు ఎవరికీ లేదని విష్ణువర్ధన్రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
Updated Date - 2020-10-23T14:42:15+05:30 IST