రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సంయుక్త కలెక్టర్కు నోటీసులు
ABN, First Publish Date - 2020-07-16T14:12:59+05:30
రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సంయుక్త కలెక్టర్కు నోటీసులు
విశాఖ: రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, విశాఖ సంయుక్త కలెక్టర్ (జేసీ) వేణుగోపాల్రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మర్రిపాలెం సర్వేనంబరు 81/3లో 17,135 చదరపు మీటర్ల విస్తీర్ణ భూమి, స్వాధీనం చేసుకుంటే గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయమై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2020-07-16T14:12:59+05:30 IST