ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-23T08:04:20+05:30

కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, సెప్టెంబరు 22: కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పరవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరవాడ పోతల వారి చేలల్లో నివాసముంటున్న బండారు వెంకటరావు(35) అనే వ్యక్తి కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి.


తాగొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో వెంకటరావు మనస్తాపం చెంది సోమవారం సాయంత్రం ఇంట్లో తలుపు వేసుకుని పురుగుల మందు తాగేశాడు. కుటుంబ సభ్యులు పెద్దగా కేకలు వేయడంతో తలుపులు తీశాడు. వెంటనే అతన్ని కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు వున్నారు. పరవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-23T08:04:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising