రేపటి నుంచి శారదా నవరాత్రి ఉత్సవాలు: స్వరూపానందేంద్ర సరస్వతి
ABN, First Publish Date - 2020-10-16T17:30:55+05:30
విశాఖ శ్రీశారదా పీఠంలో శనివారం(17/10/2020) నుంచి శారదా నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.
విశాఖపట్నం: విశాఖ శ్రీశారదా పీఠంలో శనివారం(17/10/2020) నుంచి శారదా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు, యావత్ భారత దేశానికి మంచి జరగాలని రాజశ్యామల యాగం, చండీ హోమము, నవావరణ అర్చన, నిత్యం పంచామృత అభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా నవరాత్రి ఉత్సవాల్లో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఉంటుందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు.
Updated Date - 2020-10-16T17:30:55+05:30 IST