జీపు బోల్తా...మహిళ మృతి
ABN, First Publish Date - 2020-11-24T16:05:50+05:30
నగరంలోని ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
విశాఖపట్నం: నగరంలోని ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ జీపు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా పెదబయలు మండలం గడుగుపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. వీరంతా ఒరిస్సాలోని కిందిపడ దేవాలయానికి దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2020-11-24T16:05:50+05:30 IST