ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-02-20T08:27:48+05:30

ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో ఓ యువతి మద్దిలపాలెంలోని మూడంతస్తుల భవనం పై నుంచి బుధవారం ఉదయం దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంవీపీ కాలనీ, ఫిబ్రవరి 19 : ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారనే మనస్తాపంతో ఓ యువతి మద్దిలపాలెంలోని మూడంతస్తుల భవనం పై నుంచి బుధవారం ఉదయం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మద్దిలపాలెంలోని అచ్చివారివీధిలో మనసల శ్రీనివాసరావు, భార్య, కుమార్తె పద్మావతి (20)తో నివాసం ఉంటున్నారు. పద్మావతి డిగ్రీ వరకూ చదివింది. కొంతకాలం కిందట డాబాగార్డెన్స్‌కు చెందిన ఓ యువకుడు పరిచయం ప్రేమకు దారి తీసింది. పద్మావతి ప్రియుడు డిప్లొమా చేసి నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో పద్మావతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన పద్మావతి బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తమకు చెందిన మూడంతస్తుల  భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు ఘటనా స్థలానికి సీఐ షణ్ముఖరావు సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2020-02-20T08:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising