కరోనా నివారణకు ప్రత్యేక బృందాలు
ABN, First Publish Date - 2020-04-01T10:19:16+05:30
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్ అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వినయ్ చంద్
మహారాణిపేట,మార్చి31: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో కోవిడ్-19పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ టీమ్లలో సీనియర్ మెడికల్ ఆఫీసర్, ఫిజీషియన్, పారా మెడికల్, అర్బన్ ప్లానింగ్ సిబ్బంది ఉంటారని తెలిపారు. ప్రతీ టీమ్కు అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని వివరించారు. పట్టణ ప్రాంతాలను జీవీఎంసీ కమిషనర్, మునిసిపాలిటీలను జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది, అధికారులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్ పాల్గొన్నారు.
Updated Date - 2020-04-01T10:19:16+05:30 IST