ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని రిటైర్డ్‌ టీటీఈ మృతి

ABN, First Publish Date - 2020-02-20T08:30:02+05:30

రైలు ఢీకొని రిటైర్డ్‌ టీటీఈ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకెలపాలెం, ఫిబ్రవరి 19 : లంకెలపాలెం సమీపంలో బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు ఢీకొనడంతో రిటైర్డ్‌  టీటీఈ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. లంకెలపాలెం గ్రామానికి చెందిన గనిరెడ్డి జువ్వాలు (61) రైల్వే శాఖలో టీటీఈగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. బుధవారం ఇంటి నుంచి లంకెలపాలెం జంక్షన్‌కు వెళ్లేందుకు స్థానికంగా గల రైల్వే ట్రాక్‌ దాటుతుండగా విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న గుర్తు తెలియని రైలు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జువ్వాలు తల, శరీర భాగాలు వేర్వేరు అయ్యాయి. జీఆర్పీ ఎస్‌ఐ భుజంగరావు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ వైద్యానికి తీసుకెళ్లి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. దువ్వాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-20T08:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising