ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న దర్శనాల వేళల్లో స్వల్ప మార్పులు

ABN, First Publish Date - 2020-12-15T05:53:25+05:30

సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు మోగే నెలగంటతో ధనుర్మాసోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే సేవలు, దర్శనాల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు ఏఈవో కేకే రాఘవకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు ఆర్జిత సేవలు, నిత్య కల్యాణాలు రద్దు

సింహాచలం, డిసెంబరు 14: సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీ ఉదయం 6.57 గంటలకు మోగే నెలగంటతో ధనుర్మాసోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆలయంలో జరిగే సేవలు, దర్శనాల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు ఏఈవో కేకే రాఘవకుమార్‌ తెలిపారు. మంగళవారం నుంచి 24వ తేదీ వరకు పగల్‌పత్తు ఉత్సవాలను నిర్వహించనున్నందున రోజూ వేకువజామున స్వామివారి తిరువీధి జరుగుందన్నారు. 25వ తేదీ నుంచి జనవరి మూడు వరకు రాపత్తు ఉత్సవాలను నిర్వహించనున్నందున ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు తిరువీధి జరుతుందన్నారు. రాపత్తు ఉత్సవ రోజుల్లో రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. అలాగే జనవరి పది నుంచి 14 వరకు వార్షిక ధారోత్సవాలు జరగనున్నందున జనవరి పది నుంచి 15 వరకు స్వామివారి నిత్యకల్యాణాలు, తదితర ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. జనవరి 13వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు గోదారంగనాథుల కల్యాణోత్సవంతో పాటు ఆ రోజు ఉదయం జరగాల్సిన నిత్య కల్యాణాన్ని నిర్వహిస్తామని ఏఈవో తెలిపారు.


Updated Date - 2020-12-15T05:53:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising