ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే వీధిలో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2020-08-05T10:35:14+05:30

జీవీఎంసీ పరిధి తాటిచెట్లపాలెం ప్రధాన రహదారి సమీపంలో ఒకే వీధిలో మంగళవారం ముగ్గురు మృతి చెందడంతో కలకలం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమకు సమాచారం లేదన్న జీవీఎంసీ అధికారులు

కరోనా పరీక్షలు చేశారో లేదో తెలియని వైనం


తాటిచెట్లపాలెం, ఆగస్టు 4 : జీవీఎంసీ పరిధి తాటిచెట్లపాలెం ప్రధాన రహదారి సమీపంలో ఒకే వీధిలో మంగళవారం ముగ్గురు మృతి చెందడంతో కలకలం రేగింది. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అయితే ఈ మరణాలపై తమకెలాంటి సమాచారం లేదని జీవీఎంసీ అధికారులు తెలిపారు. ఒకరు గుండెపోటు, మరొకరు పచ్చ కామెర్లతో మృతి చెందినట్టుగా స్థానికులు చెబుతున్నారు.


అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించారా? లేదా? అనే విషయం తెలియలేదు. గత కొద్ది రోజులుగా రైల్వే న్యూ కాలనీ, సాక్షి గణపతి ఆలయం వీధి, తాటిచెట్లపాలెం, నందగిరినగర్‌, వెంకటేశ్వర కాలనీ, శ్రీనివాసనగర్‌ తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.   కొద్ది రోజుల క్రితం రైల్వే న్యూ కాలనీ ప్రధాన రహదారిలోని ఓ మందుల దుకాణం యజమాని కరోనా వైరస్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-05T10:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising