ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాఫీకి మద్దతు ధర ప్రకటించాలి

ABN, First Publish Date - 2020-12-14T05:29:41+05:30

గిరి రైతులు పండించిన కాఫీకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు సియ్యారి దొన్నుదొర డిమాండ్‌ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న దొన్నుదొర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ సీనియర్‌ నాయకుడు సియ్యారి దొన్నుదొర


అరకులోయ, డిసెంబరు 13: గిరి రైతులు పండించిన కాఫీకి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు సియ్యారి దొన్నుదొర డిమాండ్‌ చేశారు. ఆదివారం దొరవలసలో కాఫీ రైతులతో మాజీ సర్పంచ్‌ సమర్ది రఘనాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ, మిరియాలకు మద్దతు ధర నేటి వరకు ప్రకటించకపోవడం సమంజసంగా లేదన్నారు. మద్దతుధర ప్రకటించి జీసీసీ ద్వారా గానీ, రైతు భరోసా కేంద్రాల ద్వారా గానీ కొనుగోలు చేయాలన్నారు. గత ఏడాది జీసీసీ కొనుగోలు చేసిన కాఫీకి రెండవ విడత బకాయిలు చెల్లించాలని కోరారు. అరకు కాఫీకి అంతర్జాతీ ఖ్యాతిని చంద్రబాబునాయుడు తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమార్‌, యువజన సంఘం నాయకుడు పి.దాసు, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-14T05:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising