ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిటీ సర్వీసులకు ఆదరణ అంతంతే...

ABN, First Publish Date - 2020-09-22T10:26:36+05:30

నగరంలో సిటీ బస్సులు నడుస్తున్నా వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారు. కరోనా భయంతో ఎక్కువ మంది సొంత వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సోమవారం 31 వేల మంది రాకపోకలు 

30 రూట్లలో 272 సర్వీసులు నడిపిన పీటీడీ  


ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 21: నగరంలో సిటీ బస్సులు నడుస్తున్నా వాటిలో ప్రయాణించేందుకు ప్రజలు భయపడుతున్నారు. కరోనా భయంతో ఎక్కువ మంది సొంత వాహనాలనే వినియోగిస్తుండడంతో సిటీ సర్వీసులకు ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సోమవారం నగరంలో ఎంపిక చేసిన 30 రూట్లలో 272 సిటీ బస్సులు ఆపరేట్‌ చేసినా కేవలం 31 వేల మంది మాత్రమే వాటిలో ప్రయాణించినట్టు అధికారులు లెక్కలుగట్టారు.  సగటు ఆక్యుపెన్సీ 26 శాతంగా నమోదయింది. 


రోజువారీ ఆదాయం రూ.6 లక్షలు వచ్చింది. కొవిడ్‌ ప్రభావానికి ముందు సిటీలో రోజుకు 580 సర్వీసులు నడవగా, సగటున 3 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. 76 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదయ్యేది. రోజువారీ ఆదాయం సుమారు రూ.57 లక్షలుండేది. అప్పటితో పోల్చుకుంటే కేవలం 10 శాతం మాత్రమే ఆదాయం వస్తోందని పీటీడీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-09-22T10:26:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising