ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరలు అదుపు చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2020-11-01T05:16:05+05:30

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో జగన్‌ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి విమర్శించారు.

కూరగాయలు మెడలో వేసుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ మహిళా నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి

మహారాణిపేట, అక్టోబరు 31: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో జగన్‌ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం మెడలో కూరగాయల దండలు వేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ధరల పరిస్థితి చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో హాయిగా జీవితాలు గడిపిన జనం ప్రస్తుత పరిస్థితి చూసి ఖిన్నులవుతున్నారన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రభుత్వం కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలతో బిజీగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ధరల అదుపునకు చర్యలు చేపట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మహిళా నాయకులు గనగళ్ల సత్యవతి, వెంకటలక్ష్మి, గోడి అరుణ, శ్యామల, భవాని, సంతోషి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T05:16:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising