పాఠశాలలను సందర్శించిన ఆర్జేడీ
ABN, First Publish Date - 2020-12-03T05:34:24+05:30
మండలంలోని కూండ్రం, కొప్పాక, మామాడిపాలెం ఉన్నత పాఠశాలలను ఆర్జేడీ కె.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు.
కొత్తూరు: మండలంలోని కూండ్రం, కొప్పాక, మామాడిపాలెం ఉన్నత పాఠశాలలను ఆర్జేడీ కె.నాగేశ్వరరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఉపాధ్యాయులను ఆరా తీశారు. అలాగే విద్యార్థుల హాజరు శాతాన్ని నమోదు చేసుకున్నారు. విద్యార్థులు తప్పకుండా మాస్కు ధరించేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో దివాకర్ ఉన్నారు.
Updated Date - 2020-12-03T05:34:24+05:30 IST