ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.20.21 కోట్లతో పీహెచ్‌సీ భవనాలకు మరమ్మతులు

ABN, First Publish Date - 2020-11-28T06:16:12+05:30

జిల్లాలోని 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) భవనాలకు మరమ్మతు పనులు చేస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ పాడేరు ఇన్‌చార్జి ఈఈ వేణుగోపాలరావు తెలిపారు.

మరమ్మతు పనులు జరగనున్న యు.చీడిపాలెం పీహెచ్‌సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి (పాడేరు) ఈఈ వేణుగోపాలరావు 


కొయ్యూరు, నవంబరు 27: జిల్లాలోని 39 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) భవనాలకు మరమ్మతు పనులు చేస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ పాడేరు ఇన్‌చార్జి ఈఈ వేణుగోపాలరావు తెలిపారు. శుక్రవారం మండల పర్యటనకు వచ్చిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ రూ.20.21 కోట్లు మంజూరు చేయగా, దీనిలో 30 శాతం నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు ఆయా పీహెచ్‌సీల ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన నిధులతో పీహెచ్‌సీల భవనాలకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేస్తున్నట్టు చెప్పారు. నాతవరం మండలంలో రూ.1.9 కోట్లతో నూతన పీహెచ్‌సీ భవన నిర్మాణం జరుగుతున్నదన్నారు. రోలుగుంట మండలంలో రూ.1.33 కోట్లు, మాకవరపాలెంలో రూ.1.49 కోట్లు, మాడుగులలో రూ.1.29 కోట్లు, గొలుగొండలో రూ.1.76 కోట్లు, రావికమతంలో రూ.45 లక్షలు, జీకేవీధిలో రూ.3.23 కోట్లు, చింతపల్లిలో రూ.25 లక్షలు, హుకుంపేటలో రూ.1.3 కోట్లు, పెదబయలులో రూ.1.11 కోట్లు, ముంచంగిపుట్టులో రూ.61 లక్షలు, కొయ్యూరు మండలంలో రూ.2.47 కోట్లతో ఆయా పీహెచ్‌సీల్లో పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈఈ వేణుగోపాలరావు వివరించారు. 


Updated Date - 2020-11-28T06:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising