ఆయిల్ ట్యాంకర్ల సిబ్బంది సమ్మె విరమణ
ABN, First Publish Date - 2020-08-13T11:20:08+05:30
హెచ్పీసీఎల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు చేపడుతున్న సమ్మెను బుధవారం సాయంత్రం నుంచి విరమించారు.
మల్కాపురం, ఆగస్టు 12 : హెచ్పీసీఎల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ ట్యాంకర్ల డ్రైవర్లు, క్లీనర్లు చేపడుతున్న సమ్మెను బుధవారం సాయంత్రం నుంచి విరమించారు. దీంతో చమురు ఉత్పత్తుల రవాణా పునః ప్రారంభించారు. సంస్థ అధికారులకు, యూనియన్ ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. చమురు ఉత్పత్తుల మాయంపై అధికారుల నివేదిక ఆధారంగా డ్రైవర్లు, క్లీనర్లను తిరిగి విధులలోకి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Updated Date - 2020-08-13T11:20:08+05:30 IST