ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 ఏళ్లు దాటితే ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వద్దు

ABN, First Publish Date - 2020-06-04T09:10:31+05:30

కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేయవద్దని ఎమ్మెల్సీ రఘువర్మకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ రఘువర్మకు ఉపాధ్యాయుల వినతి


చోడవరం: కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు 50 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేయవద్దని ఎమ్మెల్సీ రఘువర్మకు ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం చోడవరం వచ్చిన ఆయనకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలలు తెరిచేలోగా బదిలీలు చేపట్టాలని, పదోన్నతులు కల్పించాలని, నాడు-నేడు, మనబడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాత్ర తగ్గించాలని కోరారు. ఈ సమస్యలపై ఎంఈవో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రఘువర్మ సూచించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు గొల్లు శ్రీనివాసరావు, ఎం.మహలక్ష్మీనాయుడు, ఎల్‌.కొండలరావు, సత్యనారాయణ, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:10:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising