నల్ల చట్టాలను వెనక్కి తీసుకోండి
ABN, First Publish Date - 2020-11-27T05:43:16+05:30
కార్మికులు, రైతుల మనుగడను ప్రశ్నార్థం చేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు డిమాండ్ చేశారు.
సార్వత్రిక సమ్మెలో వామపక్షాలు
చోడవరం, నవంబరు 26: కార్మికులు, రైతుల మనుగడను ప్రశ్నార్థం చేసే చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహనరావు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వామపక్షాల నాయకులు, కార్మికులు పట్టణంలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొత్తూరు జంక్షన్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.భాస్కరరావు, ఆర్.అప్పలరాజు పాల్గొన్నారు.
బుచ్చెయ్యపేటలో...
బుచ్చెయ్యపేట: సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వడ్డాదిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు గునూరు వరలక్ష్మి, జి.వెంకటరమణ, మొల్లి శ్రీను, పి.సాంబశివరావు, చినబ్బాయి పాల్గొన్నారు.
రావికమతంలో...
రావికమతం: మండలంలోని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, భోజన నిర్వాహకులు సమ్మెలో పాల్గొన్నారు. నాలుగురోడ్ల కూడలి వద్ద రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీపీఏం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
రోలుగుంటలో...
రోలుగుంట: సమ్మెకు మద్దతుగా వివిధ రంగాల కార్మికులు ర్యాలీ చేశారు. రైతుల వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్లను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటీకరణను ఆపాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-27T05:43:16+05:30 IST