ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాధారణమైంది కాదు..చాలా పెద్ద దుర్ఘటన

ABN, First Publish Date - 2020-07-07T19:04:54+05:30

ఎల్‌జీ పాలిమర్స్‌లో సంభవించిన ప్రమాదం సాధారణమైనది కాదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్‌జీ ప్రమాదంపై హైపవర్‌ కమిటీ నివేదిక

యాజమాన్య నిర్లక్ష్యమే కారణం

ఏప్రిల్‌ 24నే ట్యాంకు నుంచి సిగ్నల్‌ వచ్చినా...పట్టించుకోలేదు

ఇప్పటికీ కంపెనీలో 36 సైరన్లు పనిచేయడం లేదు

సిబ్బందికీ అవగాహనా లేదు, శిక్షణా లేదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌లో సంభవించిన ప్రమాదం సాధారణమైనది కాదని, ‘చాలా పెద్ద దుర్ఘటన’ అని హైపవర్‌ కమిటీ వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై స్పెషల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన హైపవర్‌ కమిటీ తన నివేదికను సీఎం జగన్‌కు అమరావతిలో సోమవారం అందజేసింది. అందులో కమిటీ అనేక వ్యాఖ్యలు చేసింది. ఎల్‌జీ యాజమాన్యం పరిశ్రమ నిర్వహణలో చాలా నిర్లక్ష్యం ప్రదర్శించిందని స్పష్టంచేసింది. ఈ ప్రమాదంతో పరిశ్రమల పర్యవేక్షణలో వివిధ శాఖల మధ్య కొంత గ్యాప్‌ ఉన్నట్టు గుర్తించామని, అందుకని ప్రత్యేకంగా అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పరిశ్రమల్లో భద్రతకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం వుందని హైపవర్‌ కమిటీ సూచించింది.


- ప్రమాదం జరగడానికి రెండు వారాల ముందు అంటే ఏప్రిల్‌ 24న స్టైరిన్‌ ట్యాంక్‌ ఎం.6లో పొలమరైజేషన్‌ ప్రారంభమైనట్టు సిగ్నల్‌ వచ్చింది. దానిని సిబ్బంది గానీ, యాజమాన్యం గానీ పట్టించుకోలేదు. అప్పుడే అప్రమత్తమై వుంటే అంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు.

- డిసెంబరు, 2019లో ట్యాంకు పైపులైన్‌ సర్క్యులేషన్‌లో లోపాలు తలెత్తాయి. మిక్సింగ్‌ సమస్యలు కనిపించాయి. వాటికి మరమ్మతులు చేశారు. కానీ శాస్త్రీయంగా జరగలేదు. ఆ లోపాలే ఆ తరువాత పెద్ద సమస్యకు దారితీశాయి.

- ట్యాంకుల డిజైన్లలో లోపాలు ఉన్నాయి. దానివల్ల కూలింగ్‌ సర్క్యులేషన్‌ సరిగ్గా జరగక, మిక్సింగ్‌ సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగింది.  

- సిబ్బందికి ఎంత ప్రమాదకరమైన పరిశ్రమలో పనిచేస్తున్నారో అవగాహన లేదు. సరైన శిక్షణ లేదు. 

- కరోనా లాక్‌డౌన్‌కు ముందు కంపెనీని మూసివేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. అలాగే లాక్‌డౌన్‌ తెరుస్తున్నప్పుడు కూడా అనుసరించాల్సిన విధానాలు పట్టించుకోలేదు.

- ప్రమాదం జరిగిన తరువాత కూడా అలారం సిస్టమ్‌ను యాజమాన్యం పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ కంపెనీలో 36 అలారం కేంద్రాలు పనిచేయడం లేదు. 

- ప్రమాదం జరిగితే విరుగుడుకు అవసరమైన రసాయనాలను కూడా అందుబాటులో ఉంచుకోలేదు. 

Updated Date - 2020-07-07T19:04:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising