ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు ఈనెల 14నాటికి పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-11-04T04:34:51+05:30

నాడు-నేడు పనులు ఈనెల 14నాటికి పూర్తి చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న డీడీ విజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడబ్ల్యూ డీడీ విజయ్‌కుమార్‌

చింతపల్లి, నవంబరు 3: ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు ఈనెల 14వ తేదీ నాటికి పూర్తిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కొయ్యూరు, చింతపల్లి, జీకేవీధి మండలాల హెచ్‌ఎంలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలలు పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. మరుగుదొడ్లు, మంచినీటి పథకాలు సత్వరంగా పూర్తిచేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు నాడు-నేడు పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించేంది లేదన్నారు. ఈ సమావేశంలో ఏటీడబ్ల్యూవో చంద్రశేఖరరావు, స్థానిక హెచ్‌ఎం జేఏ కొండలరావు, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. 


డౌనూరు ఆశ్రమ పాఠశాల తనిఖీ

కొయ్యూరు: మండలంలోని డౌనూరు బాలుర ఆశ్రమ పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాడు-నేడు పనులు, పాఠశాలలో పారిశుధ్య చర్యలు పరిశీలించారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూవో శ్రీనివాసరావు, వార్డెన్‌ మల్లేశ్‌ ఉన్నారు. 


Updated Date - 2020-11-04T04:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising