ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యపై అనుమానంతో భర్త యాసిడ్ దాడి చేయగా..

ABN, First Publish Date - 2020-10-31T19:14:05+05:30

విశాఖలో దారుణం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. సంతోషంగా వారి కుటుంబంలోకి అనుమానం అనే పెనుభూతం చొరబడింది. దీంతో ఏకంగా భార్యనే హత్య చేయాలని ప్లాన్ చేశాడు. శనివారం నాడు భార్యపై భర్త యాసిడ్‌ దాడి చేశాడు. సరిగ్గా ఇదే టైమ్‌లో కూతురు అడ్డు రాగా చేతిపై పడింది. ఈ ఘటనలో భార్య, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ యాసిడ్ బాత్రూమ్‌ క్లీనింగ్‌ వాడేది కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖలోని శివాజీ పాలెంలో చోటు చేసుకుంది. 


పూర్తి వివరాల్లోకెళితే.. ఈశ్వరరావు అనే పెయింటర్ భార్య దేవి, కుమార్తె గాయత్రితో కలిసి శివాజీ నగర్‌లో నివాసముండేవాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ భార్యతో నిత్యం గొడవపడుతుండేవాడు. అలా భార్యతో రోజూ జరుగుతున్న గొడవల నేపథ్యంలో అనుమానం పెంచుకున్న భర్త ఏకంగా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-31T19:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising