ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

44 రోజులు.. రూ.1,75,79,073.!

ABN, First Publish Date - 2020-12-18T05:07:32+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు గత 44 రోజుల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.75 కోట్ల ఆదాయం దేవస్థానం ఖజానాకు సమకూరింది.

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదీ అప్పన్న స్వామి హుండీ ఆదాయం

సింహాచలం, డిసెంబరు 17: వరాహలక్ష్మీనృసింహస్వామికి భక్తులు గత 44 రోజుల్లో సమర్పించిన కానుకల ద్వారా సుమారు రూ.1.75 కోట్ల ఆదాయం దేవస్థానం ఖజానాకు సమకూరింది. ఈవో వి.త్రినాథరావు పర్యవేక్షణలో గురువారం బేడా మండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ.1,75,79,073, ఆభరణాల రూపంలో స్వర్ణం 208.07 గ్రాములు, రజితం 11.4 కిలోలు లభించింది. అలాగే యూఎస్‌ఏకు చెందిన 115 డాలర్లు, కెనడావి పది డాలర్లు, యూఏఈకి చెందిన 25 దీరమ్స్‌, తదితర విదేశీ కరెన్సీ కూడా అప్పన్న ఖజానాకు చేరింది. హుండీల లెక్కింపునకు జిల్లా దేవదాయశాఖ ఏసీ కార్యాలయ పర్యవేక్షణాధికారి సుధారాణి ప్రత్యేక పర్యవేక్షకురాలిగా హాజరవ్వగా ఏఈవోలు, పలువురు ట్రస్టీ సభ్యులు పాల్గొన్నారు.




Updated Date - 2020-12-18T05:07:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising