ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టౌన్‌ ప్లానింగ్‌లో అంతర్గత బదిలీలకు సన్నాహాలు

ABN, First Publish Date - 2020-12-13T06:00:35+05:30

జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో భారీగా అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది.

జీవీఎంసీ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

70 శాతం సిబ్బందికి స్థానచలనం?

విశాఖపట్నం, డిసెంబరు 12(ఆంధ్రజోతి): జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో భారీగా అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఏసీపీ స్థాయి వరకూ అందరికీ స్థానచలనం కల్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన, చీఫ్‌ సిటీ ప్లానర్‌ ఆర్జే విద్యుల్లత నిర్ణయించారు. ఈమేరకు జాబితా సిద్ధం చేసిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తుది పరిశీలన నిమిత్తం కమిషనర్‌కు పంపించారు. సోమవారం బదిలీలకు సంబంధించిన తుది ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. జీవీఎంసీలో నలుగురు ఏసీపీలతోపాటు మరో ఎనిమిది మంది టీపీవోలు, టీపీఎస్‌లు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లను అమరావతిలోని ప్రధాన కార్యాలయానికి సరెండర్‌ చేయగా, వీరి స్థానంలో ముగ్గురు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీఎస్‌లు, ఇద్దరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లను కేటాయించిన విషయం తెలిసిందే. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారంతా రిపోర్టుచేశారు. దీంతో వీరందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్‌ విభాగం ప్రక్షాళన చేయాలని అధికారులు భావించారు. విభాగంలో 70 శాతం అధికారులు, ఉద్యోగులను అక్కడి నుంచి వేరొక జోన్‌కు బదిలీ చేయనున్నట్టు సమాచారం.


Updated Date - 2020-12-13T06:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising