ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాడు-నేడు’ ప్రణాళికలను రూపొందించాలి

ABN, First Publish Date - 2020-12-06T05:43:48+05:30

విద్యార్థులను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చే ఫిబ్రవరి నాటికి నాడు-నేడు పథకం ప్రణాళికలను రూపొందించాలని జీవీఎంసీ పాఠశాలల హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సూచించారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ కమిషనర్‌ సృజన 

సిరిపురం, డిసెంబరు 5: విద్యార్థులను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చే ఫిబ్రవరి నాటికి నాడు-నేడు పథకం ప్రణాళికలను రూపొందించాలని జీవీఎంసీ పాఠశాలల హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సూచించారు. శనివారం సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్‌ ఎరీనాలో అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావుతో కలిసి విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాడు-నేడు’లో ప్రధాన భాగస్వాములైన తల్లిదండ్రుల కమిటీలకు విద్యార్థులకు అవసరమయ్యేలా నూతన ప్రణాళికలను రూపొందించడంపై అవగాహన కల్పించాలన్నారు. బాల (బిల్డింగ్‌ ఏక్‌ ఏ లెర్నింగ్‌ ఎయిడ్‌ ) విధానంలో ప్రణాళికలను రూపొందించాలని, అప్పుడే ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా జీవీఎంసీ పాఠశాలలు ఉంటాయని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

====


Updated Date - 2020-12-06T05:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising