కట్నం ఇవ్వలేక ఆగిపోయిన పెళ్లి సంబంధం.. మనస్తాపంతో ఆ యువతి..
ABN, First Publish Date - 2020-04-08T18:27:05+05:30
కట్నకానుకలు ఇచ్చుకోలేక పెళ్లి సంబంధం ఆగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివ రాలు...
అడిగినంత కట్నకానుకలు ఇచ్చుకోలేక...
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ఎస్.రాయవరం (విశాఖపట్టణం): కట్నకానుకలు ఇచ్చుకోలేక పెళ్లి సంబంధం ఆగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని వాకపాడుకు చెందిన కె.రమామహాలక్ష్మి(20)కి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే అతని కుటుంబీకులు అడిగిన కట్నకానులు ఇచ్చే స్థోమత తమకు లేదని చెప్పడంతో సంబంధం ఆగిపోయింది. దీంతో మహాలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన అన్నయ్య నచ్చచెప్పారు. కానీ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహాలక్ష్మి ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు మృతురాలి ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. ఎస్ఐ ధనుంజయ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-04-08T18:27:05+05:30 IST