ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనేతరుల గుర్తింపు కార్డులను మన్యంలో రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-11-29T06:21:44+05:30

గిరిజనేతరులు ఏజెన్సీలో కలిగి ఉన్న ఓటరు, రేషన్‌ కార్డులు, విద్యుత్‌ కనెక్షన్‌లను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి శనివారం వినతిపత్రం అందజేశారు.

ఆర్డీవో లక్ష్మీశివజ్యోతికి వినతిపత్రం అందిస్తున్న జేఏసీ నాయకులు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవోకు వినతిపత్రం అందించిన జేఏసీ నాయకులు


పాడేరురూరల్‌, నవంబరు 28: గిరిజనేతరులు ఏజెన్సీలో కలిగి ఉన్న ఓటరు, రేషన్‌ కార్డులు, విద్యుత్‌ కనెక్షన్‌లను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు ఆర్డీవో కె.లక్ష్మీశివజ్యోతికి శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, తాజంగి వంటి పర్యాటక ప్రాంతాల్లో అనుమతులు లేకుండా వేసిన గుడారాలను తొలగించాలని ఆమెను కోరారు. సానుకూలంగా స్పందించిన ఆమె గుడారాలు వేసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఆదివాసీ భూములు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఆర్డీవోని కలిసిన వారిలో జేఏసీ నాయకులు రామారావుదొర, రామకృష్ణ, నందు, ప్రసాద్‌నాయుడు, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:21:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising