180 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
ABN, First Publish Date - 2020-11-03T06:05:42+05:30
మన్యం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 180 కిలోల సరుకుని, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జి.మాడుగుల ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు.
పాడేరురూరల్ (జి.మాడుగుల), నవంబరు 2: మన్యం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 180 కిలోల సరుకుని, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జి.మాడుగుల ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా, పాడేరు వైపు వెళ్తున్న ఒక వాహనంలో గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పవర్పేటకు చెందిన సిరిముల గౌరీనాయుడు, ముంచంగిపుట్టు మండలం పెదగూడ గ్రామానికి చెందిన వంతాల నాగేశ్వరరావును అరెస్టు చేసి, గంజాయిని, వాహనాన్ని సీజ్ చేశామన్నారు. నిందితులను పాడేరు కోర్టులో హాజరు పర్చగా 15 రోజులు రిమాండ్ విధించారన్నారు.
Updated Date - 2020-11-03T06:05:42+05:30 IST