ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్ష సాధింపులు మానుకోవాలి

ABN, First Publish Date - 2020-07-05T09:47:37+05:30

రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు మాని అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టిసారించాలని మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధిపై సీఎం జనగ్‌ దృష్టి పెట్టాలి

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు


కృష్ణాదేవిపేట, జూలై 4: రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు మాని అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి దృష్టిసారించాలని మాజీ మంత్రి చింతకాలయ అయ్యన్నపాత్రుడు సూచించారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో అల్లూరి జయంతి సందర్భంగా అల్లూరి, గంటం దొరల విగ్రహాలకు పూలమాలలు వేసి, సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వలో అధికారిక కార్యక్రమాలకు నాంది పలికామని, వాటిని ఈ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు.


గత ఏడాది జయంత్యుత్సవంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఇక్కడ పార్కులో పనిచేస్తున్న ముగ్గురు సంరక్షకులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో పాలకులు, అధికారులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా వారికి  అయ్యన్నపాత్రుడు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్‌, టీడీపీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, ఎంపీటీసీ చింతల నారాయణమూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T09:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising