ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెట్టండి

ABN, First Publish Date - 2020-12-12T04:30:35+05:30

ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు.

మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులకు మంత్రి ముత్తంశెట్టి ఆదేశం 


భీమునిపట్నం, డిసెంబరు 11: ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం భీమిలి క్యాంప్‌ ఆఫీసులో ప్రజా సమస్యలు, అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. భీమిలి 1,2,3 వార్డులతో పాటు విలీనమైన 4 వార్డులలో ప్రజలకు మంచినీరు, రహదారులు, వీధి దీపాలు, కాలువలు, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలన్నారు. కుళాయిల ద్వారా మంచినీరు సరఫరా కాని ప్రాంతాల్లో బోరుబావులు మంజూరుచేయాలని పలువురు నేతలు కోరారు.  మరిన్ని సమస్యలను ప్రస్తావించడంతో  అవన్నీ పరిశీలించి ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో భీమిలి జడ్సీ సిహెచ్‌.గోవిందరావు, ఎంపీడీవో పి.వెంకటరమణ, ఏసీపీ అరుణవల్లి, తహసీల్దార్‌ ఈశ్వరరావు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising