ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా కోసం తోపులాట

ABN, First Publish Date - 2020-09-01T07:21:45+05:30

స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా విక్రయం సందర్భంగా సోమవారం రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూరియా కోసం తోపులాట

కొంతమంది రైతులకు స్వల్పగాయాలు

పంపిణీని నిలిపేసిన సొసైటీ సిబ్బంది


దేవరాపల్లి, ఆగస్టు 31:  స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా విక్రయం సందర్భంగా సోమవారం రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది రైతులకు గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. రైతులు అధిక సంఖ్యలో రావడంతో ఎరువులు ముందు ఉన్న వారికే దక్కుతాయని, తమకు అందవని రైతులంతా ముందుకు దూసుకు వెళ్లారు. దీంతో కొంతమంది రైతులకు దెబ్బలు తగిలాయి. వచ్చిన రైతులను పీఏసీఎస్‌ సిబ్బంది అదుపు చేయలేక యూరియా పంపిణీ నిలుపుదల చేశారు.


అనంతరం పోలీసు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సొసైటీ సీఈవో కనకారావు మాట్లాడుతూ, తమ వద్ద 400 యూరియా బస్తాలు ఉన్నాయని, రైతులందరూ సంయమనం పాటించకపోతే తాము ఏమీ చేయలేమన్నారు. ఎరువులు అయిపోతే మరల తెప్పిస్తామన్నారు.


సీపీఎం ఆందోళన

రైతులందరికీ ఎరువులు పంపిణీ చేయాలంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు డి.వెంకన్న ఆందోళన చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్నీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులకు గాయాలు పాలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు ఎరువులు ఇవ్వని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ఆయన దుయ్యబట్టారు.


Updated Date - 2020-09-01T07:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising