ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-12-12T04:37:32+05:30

పాడేరు డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 46 మంది షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు స్పష్టం చేశారు.

ఆందోళన చేస్తున్న షిఫ్ట్‌ ఆపరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు

పాడేరురూరల్‌, డిసెంబరు 11: పాడేరు డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 46 మంది షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఈపీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయం ఎదుట షిఫ్ట్‌ ఆపరేటర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ.. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న 46 మంది నుంచి ఈఎండీ డిపాజిట్‌ పేరుతో రూ.8 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్‌ గడువు ముగిసినా నేటికీ చెల్లించలేదన్నారు. అలాగే ఈ ఏడాది జూన్‌ నెల వేతనాలను కాంట్రాక్టర్‌ నేటికీ చెల్లించలేదన్నారు. ఈ విషయమై విద్యుత్‌ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.  అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్‌ కార్మికులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

Updated Date - 2020-12-12T04:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising