పులపర్తిలో మహిళలతో డీఆర్డీఏ పీడీ సమావేశం
ABN, First Publish Date - 2020-11-29T06:06:54+05:30
మండలంలోని పులపర్తిలో గల మహిళలతో శనివారం డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు సమావేశమయ్యారు.
ఎలమంచిలి రూరల్, నవంబరు 28 : మండలంలోని పులపర్తిలో గల మహిళలతో శనివారం డీఆర్డీఏ పీడీ విశ్వేశ్వరరావు సమావేశమయ్యారు. శుక్రవారం ఈ గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వినయ్చంద్ వద్ద వైఎస్సార్ చేయూత పథకం సాయం తమకు అందలేదని పలువురు మహిళలు వాపోయిన నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించిన పీడీని గ్రామానికి పంపారు. ఈ సందర్భంగా పీడీ మహిళలతో మాట్లాడి అన్ని వివరాలను తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్టు చెప్పారు. వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, శ్రీనిధి మేనేజర్ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-29T06:06:54+05:30 IST