భీమిలి-భోగాపురం రహదారి నిర్మాణానికి డీపీఆర్
ABN, First Publish Date - 2020-12-02T05:58:10+05:30
విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నుంచి విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు తీరం వెంబడి ఆరు/ఎనిమిది వరుసల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయిస్తోంది.
కే అండ్ జే ప్రాపర్టీస్కు టెండర్ ఖరారు
విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నుంచి విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు తీరం వెంబడి ఆరు/ఎనిమిది వరుసల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుచేయిస్తోంది. ఇందుకోసం బిడ్లు ఆహ్వానించగా ఎల్ అండ్ టితో పాటు నాలుగు సంస్థలు పాల్గొన్నారు. అందులో ఎల్1గా నిలిచిన కె అండ్ జె ప్రాపర్టీస్కు బిడ్ను ఖరారు చేశారు. డీపీఆర్ను రూ.41.37 లక్షలకు తయారుచేయడానికి ఆ సంస్థ ముందుకువచ్చింది.
Updated Date - 2020-12-02T05:58:10+05:30 IST