దివ్య జీవితంలో అన్నీ విషాదాలే!
ABN, First Publish Date - 2020-06-07T14:21:47+05:30
దివ్య కుటుంబంలో అన్నీ విషాదాలే..
గతంలో అమ్మమ్మ, తల్లి, సోదరుడు హత్య
ఆత్రేయపురం(తూర్పు గోదావరి జిల్లా): దివ్య కుటుంబంలో అన్నీ విషాదాలే. దివ్య అమ్మమ్మ నాగమణికి ఇద్దరు కుమార్తెలు. ఒకరు నల్లా సుబ్బలక్ష్మి. ఆమె భర్త ఆటో డ్రైవర్. ఈ దంపతులకు దివ్య, గణేశ్ సంతానం. అలాగే పిన్ని క్రాంతివేణి యానాంకు చెందిన చప్పిడి వీరవెంకట సత్యనారాయణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సత్యనారాయణ అంతరాష్ట్ర గజదొంగ కావడంతో ఓ కేసులో శిక్షపడి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నాడు.
అదే జైలులో రాజమహేంద్రవరానికి చెందిన నల్లమహారాజు అనే రౌడీషీటర్తో పరిచయం ఏర్పడింది. బయటికివచ్చాక కలిసి దొంగతనాలు చేసేవారు. ఈ క్రమంలో వాటాల్లో తేడాలొచ్చి సత్యనారాయణ అత్తనాగమణి, దివ్య తల్లి సుబ్బలక్ష్మి, సోదరుడు గణేష్లను నల్లమహారాజు కిడ్నాప్ చేశాడు. తర్వాత వారు 2014 అక్టోబరు 16న హత్యకు గురైట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి మరో వివాహం చేసుకోవడంతో పిన్ని క్రాంతివేణి సంరక్షణలో దివ్య పెరిగింది. కాంత్రివేణిని ఆమె భర్త వదిలివెళ్లిపోయాడు. తర్వాత ఏలేశ్వరానికి చెందిన ఒకరితో దివ్యకు వివాహమైంది.
ఇవి కూడా చదవండి:
-----------------------
దివ్య కేసులో విస్మయపరిచే విషయాలు వెలుగులోకి..!
22 ఏళ్ల యువతి ఫిట్స్తో చనిపోవడమేంటి అని కాటికాపరికి అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించడంతో..
Updated Date - 2020-06-07T14:21:47+05:30 IST