ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వాహనమిత్ర’ అమలులో జిల్లాకు ప్రథమ స్థానం

ABN, First Publish Date - 2020-07-05T09:45:14+05:30

ఆటో, ట్యాక్సీ వాహన యజమానులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర అమలులో రాష్ట్రంలోనే జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆటో, ట్యాక్సీ వాహన యజమానులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వాహనమిత్ర అమలులో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని రవాణాశాఖ ఉప కమిషనర్‌ రాజారత్నం తెలిపారు. ఆటో, ట్యాక్సీ యజమానులకు ‘వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేలు చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. 2020-21 సంవత్సరానికిగానూ జిల్లాలో రూ.30 కోట్లు 38,001 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని ఆయన తెలిపారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం కావడంతో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. 29,965 మంది లబ్ధిదారులతో కృష్ణా జిల్లా రెండో స్థానంలో నిలవగా, 29,628 మంది లబ్ధిదారులతో తూర్పుగోదావరి జిల్లా మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. 

Updated Date - 2020-07-05T09:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising