డీఎడ్ కౌన్సెలింగ్ ప్రారంభం
ABN, First Publish Date - 2020-12-04T06:05:47+05:30
డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం భీమిలి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్లో గురువారం ప్రారంభమైంది.
భీమునిపట్నం, డిసెంబరు 3: డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం భీమిలి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్లో గురువారం ప్రారంభమైంది. డైట్ ప్రిన్సిపాల్ జ్యోతికుమారి పర్వవేక్షణలో ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల ఏడో తేదీ వరకు కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.
Updated Date - 2020-12-04T06:05:47+05:30 IST