వెంకటాపురంలో మరొకరి మృతి
ABN, First Publish Date - 2020-06-02T08:50:15+05:30
ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావం కారణంగా వెంకటాపురానికి చెందిన
14కు చేరిన మృతుల సంఖ్య
గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం డిమాండ్
గోపాలపట్నం(విశాఖపట్నం), జూన్ 1: ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావం కారణంగా వెంకటాపురానికి చెందిన యలమంచిలి కనకరాజు(45) అనే కార్పెంటర్ మృతి చెందాడని సీపీఎం గోపాలపట్నం డివిజన్ కమిటీ సభ్యులు ఆరోపించారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కనకరాజు ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ఘటన తరువాత అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత రెండు రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురైతే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 13 మంది మృతి చెందగా, ఇప్పుడు ఈ సంఖ్య 14కు చేరిందని పేర్కొన్నారు. ఇప్పటికీ పలువురు బాధితులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరుతున్నారని, ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2020-06-02T08:50:15+05:30 IST