ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిరైతులకు అండగా విశాఖ డెయిరీ

ABN, First Publish Date - 2020-12-13T05:30:00+05:30

పాడి రైతులకు విశాఖ డెయిరీ అండగా ఉంటుందని డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

పాలసంఘాల సిబ్బంది సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌


చోడవరం, డిసెంబరు 13: పాడి రైతులకు విశాఖ డెయిరీ అండగా ఉంటుందని డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం స్థానిక డెయిరీ నోడల్‌ కార్యాలయంలో పాల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి సుమారు 5 వేల మేలిరకం పాడి పశువులను తీసుకువచ్చి రైతులకు అందించేందుకు నిర్ణయించామన్నారు.  ఈ పశువుల రవాణా,  నెలకు సరిపడా దాణా, మినరల్‌ మిక్చర్‌, ఏడాదికి బీమా ఉచితంగా డెయిరీ భరిస్తుందన్నారు. పశువులకు పుట్టే ఆడ పెయ్యిలను 22నెలల వరకూ సంరక్షించిన పాడిరైతులకు ప్రోత్సాహకంగా రూ.3వేలు అందిస్తామన్నారు. పాలసంఘంలో 59 సంవత్సరాల లోపు వయసున్న  సభ్య రైతు మరణిసేత అతని వారసులకు చైర్మన్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.లక్ష పరిహారం చెల్లిస్తామన్నారు. వచ్చే ఏడాదికి జిల్లాలో రోజుకి 10 లక్షల లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో డెయిరీ డైరెక్టర్లు దాడి గంగరాజు, గేదెల సత్యనారాయణ, శీరంరెడ్డి సూర్యనారాయణ,  డెయిరీ అధికారి కేవీ ప్రసాద్‌, చోడవరం యూనిట్‌ మేనేజర్‌ జి.రాము, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising