ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిచ్చరపిడుగులు

ABN, First Publish Date - 2020-12-15T06:34:41+05:30

వరల్డ్‌ ఫిడే కేడెట్‌, యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎం.సాహితి వర్షిణి, బి.కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్‌ ప్రసాద్‌ అద్భుత ప్రతిభ కనబరిచారు.

సాహితి వర్షిణి, కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్‌ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్రపంచ చెస్‌ టోర్నీలో సత్తా చాటిన విశాఖ చిన్నారులు


విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 14: వరల్డ్‌ ఫిడే కేడెట్‌, యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో నగరానికి చెందిన చిన్నారులు సత్తా చాటారు. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎం.సాహితి వర్షిణి, బి.కల్యాణి, దేవకి నందన, అలన మీనాక్షి, అఖిల్‌ ప్రసాద్‌ అద్భుత ప్రతిభ కనబరిచారు. సోమవారం ఈ ఫలితాలను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. బాలికల అండర్‌-14 విభాగంలో ఎం.సాహితి వర్షిణి నాల్గవ స్థానం, అండర్‌-18 కేటగిరీలో బి.కల్యాణి తొమ్మిదో స్థానం, అండర్‌-10 విభాగంలో దేవకి నందన 19వ స్థానం, అలన మీనాక్షి 20వ స్థానాలు సాధించారు. బాలుర అండర్‌-10 విభాగంలో అఖిల్‌ ప్రసాద్‌ 34వ స్థానం దక్కించుకున్నాడు. ప్రపంచ స్థాయిలో జరిగిన ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్థులను సమర్థంగా ఎదుర్కొని ఉన్నత స్థానాలను సాధించిన చిన్నారులను విశాఖ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఆనందకుమార్‌, పి.సుబ్బారెడ్డి, ఇతర ప్రతినిధులు అభినందించారు.

Updated Date - 2020-12-15T06:34:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising