మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-11-27T05:34:31+05:30
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గురువారం మరో 84 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 58,827కు చేరాయి.
తాజాగా మరో 84 మందికి వైరస్
జిల్లాలో 58,827కు చేరిన పాజిటివ్లు
విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గురువారం మరో 84 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 58,827కు చేరాయి. వీరిలో 56,916 మంది వైరస్ నుంచి కోలుకోగా, 1046 మంది వైద్యం పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ గురువారం ఒకరు మృతి చెందడంతో కొవిడ్ మరణాలు 505కు చేరాయి.
మన్యంలో ఆరు..: పాడేరు ఏజెన్సీలో గురువారం 648 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా జీకేవీధి మండలంలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని ఏడీఎంహెచ్వో డాక్టర్ కె.లీలాప్రసాద్ తెలిపారు.
Updated Date - 2020-11-27T05:34:31+05:30 IST