ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

55 వేలకు చేరువలో కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-10-23T10:20:24+05:30

జిల్లాలో కరోనా కేసులు 55 వేలకు చేరువయ్యాయి. గురువారం జిల్లాలో మరో 171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా జిల్లాలో 171 పాజిటివ్‌ కేసులు

చికిత్స పొందుతూ మరొకరి మృతి

465కు చేరిన మొత్తం మరణాలు


విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు 55 వేలకు చేరువయ్యాయి. గురువారం జిల్లాలో మరో 171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసులు 54,987కు చేరాయి. గురువారం 175 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 52,250కి చేరింది. కాగా వివిధ ఆస్పత్రుల్లో మరో 2,272 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ గురువారం ఒకరు మృతి చెందగా, జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాలు 465కు చేరాయి. కొవిడ్‌ రెండో దశ విజృంభిస్తుందన్న వైద్యుల హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రచారం ప్రారంభించింది. 


సింహాచలంలో ఆరుగురికి..: 

సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో గురువారం 98వ వార్డుకు చెందిన 55 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


ఆర్‌ఆర్‌వీ పురంలో ఒకరికి..: 

జీవీఎంసీ 69వ వార్డు వేపగుంట సమీపంలోని ఆర్‌ఆర్‌వీపురంలో గురువారం ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-23T10:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising