ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాఫ్ట్‌ స్కిల్స్‌ను పాఠ్యాంశంగా బోధించాలి

ABN, First Publish Date - 2020-12-04T06:01:25+05:30

సాఫ్ట్‌ స్కిల్స్‌ను విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు 3: సాఫ్ట్‌ స్కిల్స్‌ను విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో రైటర్స్‌ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ జర్నలిజం విభాగం విశ్రాంత ఆచార్యుడు పి.బాబీవర్ధన్‌, ఏయూ సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షకుడు డాక్టర్‌ చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ సంయుక్తంగా రచించిన పుస్తకం ‘ప్లీట్‌ బుక్‌ ఆన్‌ సాప్ట్‌ స్కిల్స్‌’ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్రాంత ఆచార్యులు నేటి తరం యువతతో కలిసి సంయుక్తంగా పుస్తక రచన చేయాలని సూచించారు. రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం ఉపాధి కల్పనలో ఎంతో కీలకంగా నిలుస్తుందన్నారు. పుస్తక రచయితల్లో ఒకరైన బాబీవర్ధన్‌ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, భావ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T06:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising