‘బీజేపీ పటిష్టతకు అంతా కృషి చేయాలి’
ABN, First Publish Date - 2020-11-29T06:04:55+05:30
ఎలమంచిలి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు మునగపాకలో శనివారం ప్రారంభమయ్యాయి.
మునగపాక, నవంబరు 28 : ఎలమంచిలి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు మునగపాకలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి వెంకటసత్యనారాయణరావు మాట్లాడుతూ పల్లెల్లో పార్టీ పటిష్టతకు కృషి అంతా చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీఎస్ వర్మ, నాయకులు బద్దెం సూర్యనారాయణ, బుద్ద విశ్వనాథం, కేశవరావు, పరమేశ్వరరావు, జనార్థన్, నాగేశ్వరరావు, రెడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-29T06:04:55+05:30 IST